ఐ.ఏ.ఎస్. అధికారిని ఆదర్శంగా తీసుకొని ఆ దిశగా ఉన్నతంగా రాణించాలని జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్ అన్నారు. అనుకుంట గ్రామానికి చెందిన ఉప్లంచివార్ పవన్ పెన్సిల్ తో గీసిన కలెక్టర్ చిత్రపటాన్ని మంగళవారం కలెక్టరేటులో పాలనాధికారికి స్వయంగా తనతండ్రితో కలిసి అందించారు. తన మాదిరిగానే కష్టపడి ఐ.ఏ.ఎస్. కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి ఉన్నారు.
ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకం కు సంబందించిన ప్రచార రథాన్ని బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం లో జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్ జెండా ఊపి ప్రారంభించారు. జిల్లాలో ఈ ఫసల్ బీమా యోజన పై రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో జిల్లా వ్యవసాయ అధికారిని ఆశాకుమారి, వ్యవసాయ అధికారి శివకుమార్, జిల్లా కోఆర్డినేటర్ రామావత్ రామ్ సింగ్, ఇఫ్కో బీమా స్టేట్ కోఆర్డినేటర్ శివరాజా, క్లస్టర్ కోఆర్డినేటర్ సాకేత్ సిన్హా, తదితరులు పాల్గొన్నారు.