Skip to main content

Posts

Showing posts from July, 2019

కలెక్టర్ చిత్రపటం బహుకరణ

ఐ.ఏ.ఎస్. అధికారిని ఆదర్శంగా తీసుకొని ఆ దిశగా ఉన్నతంగా రాణించాలని జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్ అన్నారు. అనుకుంట గ్రామానికి చెందిన ఉప్లంచివార్ పవన్ పెన్సిల్ తో గీసిన కలెక్టర్ చిత్రపటాన్ని మంగళవారం కలెక్టరేటులో పాలనాధికారికి  స్వయంగా తనతండ్రితో కలిసి అందించారు. తన మాదిరిగానే కష్టపడి ఐ.ఏ.ఎస్. కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి ఉన్నారు.

ఫసల్ బీమా యోజన ప్రచార రథాన్ని ప్రారంభించిన కలెక్టర్

ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకం కు సంబందించిన ప్రచార రథాన్ని బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం లో జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్ జెండా ఊపి ప్రారంభించారు. జిల్లాలో ఈ ఫసల్ బీమా యోజన పై రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో జిల్లా వ్యవసాయ అధికారిని ఆశాకుమారి, వ్యవసాయ అధికారి శివకుమార్, జిల్లా కోఆర్డినేటర్ రామావత్ రామ్ సింగ్, ఇఫ్కో బీమా స్టేట్ కోఆర్డినేటర్ శివరాజా, క్లస్టర్ కోఆర్డినేటర్ సాకేత్ సిన్హా, తదితరులు పాల్గొన్నారు.

పోడుభూముల సమస్యల పరిష్కారానికి కోఆర్డినేషన్ కమిటీ : ఆదిలాబాద్ ఎస్పీ

పోడు భూముల సమస్యలు, గ్రామాల్లోని ఇరువర్గాల భూ సమస్యలు సున్నితంగా పరిష్కరించడానికి కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ అన్నారు.  కోఆర్డినేషన్ కమిటీలో  సీఐ, ఎమ్మార్వో, ఎఫ్ఆర్ఓ సభ్యులుగా ఉంటారని వివరించారు.  *గ్రామాల్లోని సమస్యలను తెలుసుకొని జిల్లా స్థాయి అధికారులకు నివేదికలు అందజేసి, పరిష్కార మార్గాన్ని ప్రజలకు తెలియజేస్తారని పేర్కొన్నారు. శనివారం స్థానిక ఏఆర్ హెడ్ క్వార్టర్ లోని పోలీస్ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఆటవిశాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి జిల్లాలోని పలు ఆదివాసి గిరిజన ప్రాంతాల్లోని సమస్యల పరిష్కారంపై తీవ్రస్థాయిలో సుదీర్ఘంగా చర్చించి, పలు కీలకమైన అంశాలపై జిల్లా పోలీసు, అటవీశాఖ అధికారులకు అవగాహన కల్పించారు, ఇటీవలే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా లో చోటు చేసుకున్న సంఘటనను దృష్టిలో ఉంచుకొని ముందస్తు కార్యచరణ ఏర్పాటు చేసుకొని సమస్యలపై సామరస్యంగా పరిష్కరించే మార్గం చూపాలని ఇరువురు అధికారులు నిర్ణయించారు, ముఖ్యంగా శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా జిల్లా అధికారులు నేరుగా సమస్యలను పరిష్కరించి ప్రజలకు వివరించాలనీ...

ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్ధన్ ప్రమాణ స్వీకారం

ఆదిలాబాదు జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ గా రాథోడ్ జనార్ధన్ శుక్రవారం ప్రమాన స్వీకారం చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో కలెక్టర్ దివ్య దేవరాజన్ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు.  జడ్పీ చైర్మన్ తోపాటు వైస్ చైర్మన్ గా ఆరె రాజన్నతోపాటు మిగితా జడ్పీటీసీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఆదిలాబాద్, బోథ్ ఎమ్మెల్యేలు జోగురామన్న, రాథోడ్ బాపురావు హాజరై తమ విలువైన సందేశాలను వినిపించారు. కార్య్రకమంలో జడ్పీ సీఈఓ వేణు, డిప్యూటీ డీఈఓ సన్యాసయ్య పాల్గొన్నారు. 

పోడు భూముల సమస్యల పరిష్కారానికి కృషి - ఎస్పీ

పోడు భూముల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తోందని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ అన్నారు. గిరిజనుల సమస్యలను పరిష్కరించడానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్టు వివరించారు. శుక్రవారం స్థానిక జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ధర్మ జీ పేట్ ఆదివాసీ గిరిజన కోలామ్ సభ్యులు 50 మంది జిల్లా ఎస్పీ ని కలిశారు, మొదటిసారిగా జిల్లా ఎస్పీని కలవడంతో శాలువాతో ఎస్పీని సన్మానించి అనంతరం ఎస్పి తో కలిసి ఫోటోలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కోలాం సంఘం జిల్లా అధ్యక్షుడు కోడప సోనే రావు పలు సమస్యలను ఎస్పీకి వివరించారు. సమస్యలను ముందుగానే ప్రభుత్వ యంత్రాంగం దృష్టికి తీసుకురానున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా స్పందించిన ఎస్పీ గిరిజన ప్రాంతాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా అర్ధరాత్రి తన వద్దకు రావచ్చని స్పష్టం చేశారు. సమస్యలను ముందుగానే పరిష్కరించడానికి గ్రామాలను సందర్శిస్తున్నట్టు వివరించారు. పోడు భూముల సమస్యలను పరిష్కరించబడనికి జిల్లా ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తుందని సూచించారు. ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా తెలియజేయాలని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో చట్టాలను చేతిలో తీసుకోవద్దని, సంయమనంతో ప...

12న మున్సిపల్ ముసాయిదా ఓటర్ల జాబితా

పురపాలక సంఘాల ఎన్నికలకు ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి అన్నారు. గురువారం రాష్ట్ర ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో పురపాలక సంఘం ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 12 న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించాలని, ఈ నెల 12 నుండి 17 వరకు అభ్యంతరాలు, అక్షేపణలు స్వీకరించి, ఈ నెల 18న ఫైనల్ జాబితాను ప్రకటించాలని అన్నారు. ఆయా వార్డులలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించాలని, ఫైనలైజేషన్ చేయాలని సూచించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సీందిని సమకూర్చుకోవాలని అన్నారు. పోలింగకు అవసరమైన బ్యాలట్ బాక్సులు, బ్యాలట్ పేపర్ల ముద్రణకు ప్రింటింగ్ ప్రెస్ల గుర్తింపు చేసుకోవాలని అన్నారు. ఎన్నికల నిర్వహణకు వినియోగించే సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లు ప్రారంభించాలని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర ఎన్నికల కార్యదర్శి అశోక్ కుమార్, మున్సిపల్ పరిపాలన సంచాలకురాలు శ్రీదేవి, జాయింట్ కలెక్టర్ జి. సంధ్యారాణి, మున్సిపల్ కమీషనర్ మారుతి ప్రసాద్, సహాయ కమ...

స్పీడ్ ను కళ్లెం వేయడానికి ఆదిలాబాద్ లో లేజర్ గన్

అతి వేగంగా వెళ్లే వాహనాలకు చెక్ పెట్టనున్న ఆదిలాబాద్ జిల్లా పోలీసులు. నూతన సాంకేతిక పరిజ్ఞానం తో అతివేగానికి సాక్షాలతో సహా నిరూపణ స్పీడ్ లేజర్ గన్ పరిజ్ఞానంతో ఆకస్మికంగా జాతీయ రహదారులపై డేగ కన్ను , ఆదిలాబాద్ పట్టణ శివారు దేవాపూర్ చెక్పోస్ట్ వద్ద ప్రధాన రహదారి పై స్పీడ్ లేజర్ గన్స్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పి:* ప్రధాన రహదారులపై స్పీడ్ లేజర్ గన్ ల ఏర్పాటు నిర్దేశించిన వేగాన్ని అతిక్రమిస్తే రూ,1400 జరిమాన నేరుగా ఇంటికే జరిమాన రశీదు నిబంధనలు పాటించాలన్న ఎస్పీ మంగళవారం జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్, ప్రధాన రహదారిపై స్పీడ్ లేజర్ గన్స్ తో డెమో నిర్వహించిన అనంతరం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ తివేగం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి ఎంతో మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని, అందులో తప్పుచేసిన వారు మరియు చేయని వారు కూడా రోడ్డు ప్రమాదాలవల్ల ప్రాణాలు కోల్పోవలసి వస్తుందని, ప్రమాదాలు జరుగుటకు కారణమైన అంశాలలో అతి వేగం కూడా ప్రధాన కారణం అని, వాహనాల అతి వేగమును నియంత్రించుటకు మెట్రో నగర శివారు ప్రాంతంలో ఉపయోగించే ...