పగటిపూట నెత్తిన సూర్యుడు మండిపోతున్నాడు. అదే రాత్రైతే చలి తీవ్రతకు అల్లాడిపోతున్నాడు. పూర్తిగా ఎండా లేదు. పూర్తిగా చలి లేదు. ఈ విచిత్ర పరిస్థితి జిల్లాలో వారం రోజులుగా కొనసాగుతోంది. ఈ పరిస్థితితో ప్రజలు అవస్థలు పడుతున్నారు. వాతావరణ విచిత్ర పరిస్థితి వల్ల వృద్ధులు, చిన్నారులు మొదలుకుని ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు.జిల్లా వాతావరణ పరిస్థితిలో మార్పుల వల్ల వచ్చే వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
రాష్ట్రంలోనే జిల్లాలో వాతావరణ పరిస్థితి భిన్నంగా ఏటా ఉంటుంది. కానీ ఈ సారి వేసవికి ముందే ఎండలు మండిపోతున్నాయి. కానీ రాత్రి సమయంలో మాత్రం చలి వణికిస్తోంది. ఈ విచిత్ర పరిస్థితి వల్ల ప్రజలు అవస్థలు పడుతున్నారు. గత వారం రోజుల నుంచి రాత్రి ఏడు నుంచి తెల్లవారి 8 గంటల వరకు ప్రజలను చలితోపాటు చలిగాలులు వణికిస్తున్నాయి. మరోవైపు ఉదయం 10 గంటలు దాటిందంటేనే సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఇక మధ్యాహ్నానికి ఎండలు హడలెత్తిస్తున్నాయి. గతంలో ఎండాకాలంలో ఎండలు, వర్షాకాలంలో వర్షాలు, చలికాలంలో చలి విపరీతంగా ఉండడం సర్వసాధారణమే. కానీ ఈ సారి పగలు ఎండ, రాత్రి చలితో ప్రజలు ఫిబ్రవరి మాసంలో వింత పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత పరిస్థితి వల్ల ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో మంచి ఆహారంతో పాటు వ్యాయామం... చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. రాత్రి నుండి తెల్లవారు జాము వరకు చలి వణికిస్తోంది. మధ్యాహ్నం వేసవిని తలపిస్తున్న ఎండలతో చెమట పడుతోంది. చిన్నారులు, వృద్ధులు, రోగులు ఈ పరిస్థితితో ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ వాతావరణ మార్పుల వల్ల స్వైన్ఫ్లూ, జ్వరం, వైరల్ఫీవర్, జలుబు వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండడం, ఇప్పటికే చిన్నారులు, వృద్ధులు, జలుబు, దగ్గు, జ్వరం వంటి వ్యాధులతో బాధపడుతూ ఆస్పత్రుల్లో క్యూ కడుతున్నారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 డిగ్రీలు అధికంగా నమోదవుతుండడం.. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడుతుండడంతో ప్రజల అనారోగ్యానికి కారణమవుతోందని వైద్యులు చెబుతున్నారు. సోమవారం జిల్లాకేంద్రంలో 12.1డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. గత మూడు రోజులుగా ఇదే పరిస్థితి. అంటే సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవు తున్నాయన్నమాట. ఇక పగటి ఉష్ణోగ్రత గరిష్టంగా 37.5 డిగ్రీలు నమోదైంది. ఉష్ణోగ్రతల్లో స్వల్ప పెరుగుదల కారణంగా వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లేకపోతే జబ్బులతో అవస్థలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
సీజనల్ వ్యాధులతో కిక్కిరిసిపోతున్న ఆస్పత్రులు
జిల్లాలో వారం రోజులుగా వాతావరణంలో నెలకొన్న మార్పులతో వ్యాధులు ప్రబలుతున్నాయి. దీంతో చిన్నపిల్లల ఆస్పత్రులతోపాటు ప్రధాన ఆస్పత్రి రిమ్స్లోనూ రోగుల తాకిడి పెరుగుతోంది. ఇటీవల వృద్ధులు, చిన్నారులు సాధారణ రోజుల్లో కన్నా పదిశాతం అధికంగా వస్తున్నారని వైద్యులు సూచిస్తున్నారు. ఇక చిన్న పిల్లల ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోనే 15 వరకు చిన్న పిల్లల ఆస్పత్రులు ్పయివేటువి ఉన్నాయి. అన్నింటా చిన్న పిల్లలతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. ఒక్కో ఆస్పత్రిలో రోజుకు 100 నుండి150 మంది చిన్నారులను వైద్యులు పరీక్షిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
రాష్ట్రంలోనే జిల్లాలో వాతావరణ పరిస్థితి భిన్నంగా ఏటా ఉంటుంది. కానీ ఈ సారి వేసవికి ముందే ఎండలు మండిపోతున్నాయి. కానీ రాత్రి సమయంలో మాత్రం చలి వణికిస్తోంది. ఈ విచిత్ర పరిస్థితి వల్ల ప్రజలు అవస్థలు పడుతున్నారు. గత వారం రోజుల నుంచి రాత్రి ఏడు నుంచి తెల్లవారి 8 గంటల వరకు ప్రజలను చలితోపాటు చలిగాలులు వణికిస్తున్నాయి. మరోవైపు ఉదయం 10 గంటలు దాటిందంటేనే సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఇక మధ్యాహ్నానికి ఎండలు హడలెత్తిస్తున్నాయి. గతంలో ఎండాకాలంలో ఎండలు, వర్షాకాలంలో వర్షాలు, చలికాలంలో చలి విపరీతంగా ఉండడం సర్వసాధారణమే. కానీ ఈ సారి పగలు ఎండ, రాత్రి చలితో ప్రజలు ఫిబ్రవరి మాసంలో వింత పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత పరిస్థితి వల్ల ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో మంచి ఆహారంతో పాటు వ్యాయామం... చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. రాత్రి నుండి తెల్లవారు జాము వరకు చలి వణికిస్తోంది. మధ్యాహ్నం వేసవిని తలపిస్తున్న ఎండలతో చెమట పడుతోంది. చిన్నారులు, వృద్ధులు, రోగులు ఈ పరిస్థితితో ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ వాతావరణ మార్పుల వల్ల స్వైన్ఫ్లూ, జ్వరం, వైరల్ఫీవర్, జలుబు వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండడం, ఇప్పటికే చిన్నారులు, వృద్ధులు, జలుబు, దగ్గు, జ్వరం వంటి వ్యాధులతో బాధపడుతూ ఆస్పత్రుల్లో క్యూ కడుతున్నారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 డిగ్రీలు అధికంగా నమోదవుతుండడం.. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడుతుండడంతో ప్రజల అనారోగ్యానికి కారణమవుతోందని వైద్యులు చెబుతున్నారు. సోమవారం జిల్లాకేంద్రంలో 12.1డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. గత మూడు రోజులుగా ఇదే పరిస్థితి. అంటే సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవు తున్నాయన్నమాట. ఇక పగటి ఉష్ణోగ్రత గరిష్టంగా 37.5 డిగ్రీలు నమోదైంది. ఉష్ణోగ్రతల్లో స్వల్ప పెరుగుదల కారణంగా వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లేకపోతే జబ్బులతో అవస్థలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
సీజనల్ వ్యాధులతో కిక్కిరిసిపోతున్న ఆస్పత్రులు
జిల్లాలో వారం రోజులుగా వాతావరణంలో నెలకొన్న మార్పులతో వ్యాధులు ప్రబలుతున్నాయి. దీంతో చిన్నపిల్లల ఆస్పత్రులతోపాటు ప్రధాన ఆస్పత్రి రిమ్స్లోనూ రోగుల తాకిడి పెరుగుతోంది. ఇటీవల వృద్ధులు, చిన్నారులు సాధారణ రోజుల్లో కన్నా పదిశాతం అధికంగా వస్తున్నారని వైద్యులు సూచిస్తున్నారు. ఇక చిన్న పిల్లల ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోనే 15 వరకు చిన్న పిల్లల ఆస్పత్రులు ్పయివేటువి ఉన్నాయి. అన్నింటా చిన్న పిల్లలతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. ఒక్కో ఆస్పత్రిలో రోజుకు 100 నుండి150 మంది చిన్నారులను వైద్యులు పరీక్షిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
Comments
Post a Comment