పురుగు మందు దాగి నేను...
పాణం దీసుకోను..
తెలంగాణ కొరకు నేను పాణమైనా ఇస్తాను..
ఓ మల్లన్న...చిగురించాలి తెలంగాణ ఆశ గంపెడంత..
అంటూ నాడు తెలంగాణ ఉద్యమంలో రైతులను భాగస్వామ్యం చేయాలని తన (చిగురించిన తెలంగాణ ఆశ)...కవితా గేయమాలికలో పిలుపునిస్తారు..మన పోతుగంటి సత్తెన్న మాస్టారు..
కరెంటేమొ కోతలాయె..
పంటలెమొ ఎండవట్టె...
రైతుకంట నీరు వొలికెరా...
ఓ మల్లన్న రైతుగోస..
వినేదెవడురా...
సేసిన అప్పులేమో..
అడ్డి మీద అడ్డి పెరిగి..
నడ్డేమో యిరగపట్టెరా..
ఓ మల్లన్న రైతు గోస..
వినేదెవడు రా...
అంటూ రైతు కష్టాలను, ఆవేదనను తన కవితాగేయమాలికలో పొందు పరుస్తారు...మన పోతుగంటి సత్తెన్న మాస్టారు.
ఏమని వ్రాయను ఓ నేస్తం..
నా పవిత్ర భారతంలో..
మర్డర్లూ..మానభంగాలు..
మతోన్మాద కలహాలు, మారణ హోమాలు..
నిత్య కృత్యాలై చరిత్ర సృష్టిస్తున్నాయని..
వ్రాయనా ఓ నేస్తాం...
నవతెలంగాణ-నిర్మల్
మన పోతుగంటి సత్తెన్న మాస్టారు నేటి నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని పాత ఎల్లాపూర్ గ్రామంలో నర్సాగౌడ్, మల్లమ్మ దంపతులకు జన్మించారు. ఖానాపూర్లో విద్యాభాసం కొనసాగించి 1972-73లో ఇంటర్మీడియెట్ పూర్తి చేశారు. 1976లో టీటీసీ పూర్తి చేసి తొలిసారిగా1977లో భీంపూర్ జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో ఉపాధ్యాయునిగా ఉద్యోగంలో చేరారు. తర్వాత 1982లో సత్తెనపెల్లిలో పని చేశారు. 1983-89 వరకు ఖానాపూర్ యూపీఎస్లో, 1989-2000 వరకు గోసంపల్లిలో, 2000-2001 వరకు కెరమెరి మండలం సాంగ్విలో పని చేశారు. 2001-2005 వరకు జాప్రాపూర్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా ఉద్యోగోన్నతి పొందారు. 2005-2011వరకు వెంకటాద్రిపేట, సోమార్పేట్, గొల్లపేట్లో పని చేశారు. 2011-2012 వరకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పని చేసి ఉద్యోగ విరమణపొందారు.
సాహిత్యంపై ప్రేరణ..
పోతుగంటి సత్తెన్న చదువుకునే రోజుల్లో రేడియోలో ఉగాది సందర్భంగా వచ్చే కవి సమ్మేళనాల్లో వివిధ కవుల కవితలను వినేవారు. అందులో డాక్టర్ సి.నారాయణరెడ్డి కవిత్వం ఆకట్టు కోవడం, నేను కూడా కవిత్వం రాస్తే బాగుంటుందని అనుకోవడంతో సాహిత్యంపై మక్కువ పెరిగింది..
ప్రశంసలు...
కవి గూడ అంజయ్య, డాక్టర్ సామల సదాశివ మాస్టారు సత్తెన్న రాసిన కవితలను ప్రశంసించారు. 2011లో అదిలాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా సాహితీ సమాఖ్యవారు ప్రశంసాపత్రం అందించారు. డాక్టర్ సి.నారాయణరెడ్డిపై రాసిన కవితకు ఆయన నుండి పోస్టు ద్వారా అభినందన పత్రము అందజేశారు.
రచనలు...
చిగురించిన తెలంగాణ ఆశ...అనే కవితా గేయమాలిక పుస్తకావిష్కరణను 2007లో ప్రథమ ముద్రణ వేశారు.
అవార్డులు...
*1995లో అదిలాబాద్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డు దక్కించుకున్నారు. వేణుగోపాలచారి చేతుల మీదుగా సన్మానం పొందారు.
* చిగురించిన తెలంగాణ ఆశ...కవితా గేయమాలిక పుస్తకావిష్కరణలో గోరేటి వెంకన్న చేతుల మీదుగా సన్మానం పొందారు.
మానవత్వం మంట గలిసె..
దానవత్వం ధరణి వెలిసే..
మరణ కాండ పెచ్చు పెరిగె..
మనిషి జాడ తెలుపదాయె..
భాయి భాయి అన్న వాడె..
బాకుతోడ పొడిచి పోయె..
రక్తం సిక్తం ధరణి తలం..
వ్యక్తికిక్కడ చోటులేదు...
గూండాలకు గొడుగు పట్టే..
రాజకీయపు అండదండలు..
అణువణువునా రాజకీయం..
అణుబాంబులా భీతిగొలుపు..
అయోధ్య మంటల్లో..
ఆహుతైన ప్రాణులెన్నో..
బొంబాయి మత బాంబుకు..
భరతమాత తల్లడిల్లెను..
రుధిర ధారలు మిన్ను ముట్టె..
హృదయస్పందన కొడిగట్టె..
మతం చిచ్చు మాసిపోదా..
మానవత్వం మేలుకొనదా..
అంటూ దేశంలో ప్రస్తుతం జరుగుతున్న అరాచకాలను తన ఏమని వ్రాయను ఓ నేస్తం కవితాగేయంలో పేర్కోంటారు. మన పోతుగంటి సత్తెన్న మాస్టారు...
సమాజాన్ని మేలుకోల్పేవిధంగా సాహిత్యం ఉండాలి
నేటి కవిత్వం ఊసుపోక రాసేది కాక..సమాజాన్ని మేలు కోల్పేలా ఉండాలి. సమాజంలో జరిగే సంఘటనలకు స్పందించి మంచి కవిత్వాన్ని నేటి కవులు అందిచాలి. కవిత్వం అందరిని ఆలోచింప చేసే విధంగా ఉండాలి. ప్రతి ఒక్కరి మనస్సు పొరల్లోకి వెల్లి చైతన్యం నింపేలా రాయాలి..
- పోతుగంటి సత్తెన్న
పాణం దీసుకోను..
తెలంగాణ కొరకు నేను పాణమైనా ఇస్తాను..
ఓ మల్లన్న...చిగురించాలి తెలంగాణ ఆశ గంపెడంత..
అంటూ నాడు తెలంగాణ ఉద్యమంలో రైతులను భాగస్వామ్యం చేయాలని తన (చిగురించిన తెలంగాణ ఆశ)...కవితా గేయమాలికలో పిలుపునిస్తారు..మన పోతుగంటి సత్తెన్న మాస్టారు..
కరెంటేమొ కోతలాయె..
పంటలెమొ ఎండవట్టె...
రైతుకంట నీరు వొలికెరా...
ఓ మల్లన్న రైతుగోస..
వినేదెవడురా...
సేసిన అప్పులేమో..
అడ్డి మీద అడ్డి పెరిగి..
నడ్డేమో యిరగపట్టెరా..
ఓ మల్లన్న రైతు గోస..
వినేదెవడు రా...
అంటూ రైతు కష్టాలను, ఆవేదనను తన కవితాగేయమాలికలో పొందు పరుస్తారు...మన పోతుగంటి సత్తెన్న మాస్టారు.
ఏమని వ్రాయను ఓ నేస్తం..
నా పవిత్ర భారతంలో..
మర్డర్లూ..మానభంగాలు..
మతోన్మాద కలహాలు, మారణ హోమాలు..
నిత్య కృత్యాలై చరిత్ర సృష్టిస్తున్నాయని..
వ్రాయనా ఓ నేస్తాం...
నవతెలంగాణ-నిర్మల్
మన పోతుగంటి సత్తెన్న మాస్టారు నేటి నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని పాత ఎల్లాపూర్ గ్రామంలో నర్సాగౌడ్, మల్లమ్మ దంపతులకు జన్మించారు. ఖానాపూర్లో విద్యాభాసం కొనసాగించి 1972-73లో ఇంటర్మీడియెట్ పూర్తి చేశారు. 1976లో టీటీసీ పూర్తి చేసి తొలిసారిగా1977లో భీంపూర్ జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో ఉపాధ్యాయునిగా ఉద్యోగంలో చేరారు. తర్వాత 1982లో సత్తెనపెల్లిలో పని చేశారు. 1983-89 వరకు ఖానాపూర్ యూపీఎస్లో, 1989-2000 వరకు గోసంపల్లిలో, 2000-2001 వరకు కెరమెరి మండలం సాంగ్విలో పని చేశారు. 2001-2005 వరకు జాప్రాపూర్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా ఉద్యోగోన్నతి పొందారు. 2005-2011వరకు వెంకటాద్రిపేట, సోమార్పేట్, గొల్లపేట్లో పని చేశారు. 2011-2012 వరకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పని చేసి ఉద్యోగ విరమణపొందారు.
సాహిత్యంపై ప్రేరణ..
పోతుగంటి సత్తెన్న చదువుకునే రోజుల్లో రేడియోలో ఉగాది సందర్భంగా వచ్చే కవి సమ్మేళనాల్లో వివిధ కవుల కవితలను వినేవారు. అందులో డాక్టర్ సి.నారాయణరెడ్డి కవిత్వం ఆకట్టు కోవడం, నేను కూడా కవిత్వం రాస్తే బాగుంటుందని అనుకోవడంతో సాహిత్యంపై మక్కువ పెరిగింది..
ప్రశంసలు...
కవి గూడ అంజయ్య, డాక్టర్ సామల సదాశివ మాస్టారు సత్తెన్న రాసిన కవితలను ప్రశంసించారు. 2011లో అదిలాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా సాహితీ సమాఖ్యవారు ప్రశంసాపత్రం అందించారు. డాక్టర్ సి.నారాయణరెడ్డిపై రాసిన కవితకు ఆయన నుండి పోస్టు ద్వారా అభినందన పత్రము అందజేశారు.
రచనలు...
చిగురించిన తెలంగాణ ఆశ...అనే కవితా గేయమాలిక పుస్తకావిష్కరణను 2007లో ప్రథమ ముద్రణ వేశారు.
అవార్డులు...
*1995లో అదిలాబాద్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డు దక్కించుకున్నారు. వేణుగోపాలచారి చేతుల మీదుగా సన్మానం పొందారు.
* చిగురించిన తెలంగాణ ఆశ...కవితా గేయమాలిక పుస్తకావిష్కరణలో గోరేటి వెంకన్న చేతుల మీదుగా సన్మానం పొందారు.
మానవత్వం మంట గలిసె..
దానవత్వం ధరణి వెలిసే..
మరణ కాండ పెచ్చు పెరిగె..
మనిషి జాడ తెలుపదాయె..
భాయి భాయి అన్న వాడె..
బాకుతోడ పొడిచి పోయె..
రక్తం సిక్తం ధరణి తలం..
వ్యక్తికిక్కడ చోటులేదు...
గూండాలకు గొడుగు పట్టే..
రాజకీయపు అండదండలు..
అణువణువునా రాజకీయం..
అణుబాంబులా భీతిగొలుపు..
అయోధ్య మంటల్లో..
ఆహుతైన ప్రాణులెన్నో..
బొంబాయి మత బాంబుకు..
భరతమాత తల్లడిల్లెను..
రుధిర ధారలు మిన్ను ముట్టె..
హృదయస్పందన కొడిగట్టె..
మతం చిచ్చు మాసిపోదా..
మానవత్వం మేలుకొనదా..
అంటూ దేశంలో ప్రస్తుతం జరుగుతున్న అరాచకాలను తన ఏమని వ్రాయను ఓ నేస్తం కవితాగేయంలో పేర్కోంటారు. మన పోతుగంటి సత్తెన్న మాస్టారు...
సమాజాన్ని మేలుకోల్పేవిధంగా సాహిత్యం ఉండాలి
నేటి కవిత్వం ఊసుపోక రాసేది కాక..సమాజాన్ని మేలు కోల్పేలా ఉండాలి. సమాజంలో జరిగే సంఘటనలకు స్పందించి మంచి కవిత్వాన్ని నేటి కవులు అందిచాలి. కవిత్వం అందరిని ఆలోచింప చేసే విధంగా ఉండాలి. ప్రతి ఒక్కరి మనస్సు పొరల్లోకి వెల్లి చైతన్యం నింపేలా రాయాలి..
- పోతుగంటి సత్తెన్న
Comments
Post a Comment