- ప్లాట్లు కబ్జా చేసి అమ్మేస్తున్న స్థానిక నాయకులు
- అడిగితే బెదిరింపులు
- లబోదిబోమంటున్న యజమానులు
మావల మండలంలోని కస్తాల రాంకిష్టు కాలనీ.. దశాబ్ద కాలం క్రితం పేదల కోసం ఏర్పాటైంది. ప్రభుత్వాలు పేదలకు భూములు కేటాయించకపోవడంతో ఎర్ర జెండా పార్టీలు పేదలతో కలిసి అక్కడ గుడిసెలు నిర్మించాయి. కనీస వసతులు లేకపోయినా అక్కడ పేదలు సంవత్సరాల తరబడి నివసించారు. కాలం గడిచిన కొద్దీ కాలనీ అభివృద్ధి చెందింది. అక్కడ ప్లాట్ల క్రయవిక్రయాలు కూడా ప్రారంభమయ్యాయి. దీంతో వివిధ అవసరాల నిమిత్తం పేదలు తాము నివసించిన గుడిసెలను అమ్ముకోవడానికి సిద్ధం కాగా, మధ్యతరగతి ప్రజలు సొంతింటి కలను నిజం చేసుకోవడానికి, భవిష్యత్ అవసరాల కోసం వాటిని కొనుగోలు చేసి ఉంచుకున్నారు.
ఈ కొనుగోలు, అమ్మకాలు కేవలం బాండ్ పేపర్ల మీదనే కొనసాగాయి. దీన్ని అవకాశంగా మలుచుకొని కొందరు నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులమనే చెప్పుకునే వారు కాలనీలో కబ్జాల పర్వం మొదలుపెట్టారు. ఖాళీ జాగా, లేదా బేస్మెంట్ వరకు కట్టి కనిపించినా సరే కబ్జా చేసేశారు. వాటిని ఇతరులకు అమ్ముకున్నారు. యజమానులు వచ్చి అడిగితే మధ్యవర్తిత్వం నడిపించారు. డబ్బులు డిమాండ్ చేయడం, అడిగినంత ఇవ్వకపోతే నీ ప్లాట్ మర్చిపొమ్మని చెప్పడం, వినకపోతే బెదిరింపులకు దిగడం మొదలుపెట్టారు. ఇలా వందలాది ప్లాట్లు కబ్జా చేసి అమ్ముకుంటూ లక్షలాది రూపాయలు సంపాదించేసుకున్నారు.
ఒక్కొక్కరికి పదేసి ఇండ్లు
పార్టీలు, సంఘాల నాయకులుగా చెప్పుకునే కొందరు కేఆర్కే కాలనీలో ప్లాట్లు కబ్జా చేసుకొని పదేసి ఇండ్లు నిర్మించుకొని వాటిని కిరాయికి ఇస్తున్నారు. స్థానిక నాయకుడిగా చెప్పుకునే ఓ వ్యక్తి ఈ కబ్జాల పర్వంలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. జాగాను కబ్జా చేసి రాత్రికి రాత్రే అక్కడ నిర్మాణాలు మొదలు పెడుతున్నాడు. యజమానులు వస్తే వారిని తీవ్ర బెదిరింపులకు గురి చేస్తున్నాడు. మానవ హక్కుల అసోసియేషన్ నాయకుడిగా చెప్పుకునే మరో వ్యక్తి కేఆర్కే కాలనీలో కనీసం పది ఇండ్లు కట్టాడు. అతను మాత్రం జిల్లా కేంద్రంలో నివాసముంటూ ఆ ఇండ్లను కిరాయికి ఇస్తున్నాడు. ఈ కబ్జాల పర్వం నిరంతరంగా కొనసాగుతుండడంతో అక్కడ ప్లాట్లు కొనుగోలు చేసిన వ్యక్తులు తీవ్ర నష్టాలకు గురై ఆర్థికంగా కుంగిపోతున్నారు.
ఊరడింపులు.. బెదిరింపులు..
తమ ప్లాటు కబ్జా అయిందని ఎవరైనా స్థానిక నాయకులకు వద్దకు వెళ్లి గోడు వెళ్లబోసుకుంటే.. ముందుగా వారిని ఊరడిస్తున్నారు. కబ్జా చేసిన వారికే ఆ ప్లాటు వదిలివేయాలని, వేరే ప్లాటు చూయిస్తామని చెబుతున్నారు. నెలలు గడిచినా వేరే ప్లాటు చూయించక మళ్లీ కలిస్తే.. చూయిస్తామంటూ చెబుతున్నారు. ఒత్తిడి తెస్తే ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోవాలని, పోలీస్ స్టేషన్కు వెళ్లినా సివిల్ కేస్ అంటారని చెబుతున్నారు. ప్లాట్ల దగ్గరికి వెళ్తే.. ఇటు వైపు మళ్లీ వస్తే కాళ్లు చేతులు విరగ్గొడ్తామని అక్కడి వారు భయపెడుతున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక ప్లాట్ల యజమానులు తలలు పట్టుకుంటున్నారు. ప్రాణభయంతో ప్లాట్లను విడిచిపెట్టేసి ఆర్థికంగా నష్టపోతున్నారు.
కొన్నింటికే పట్టాలు
కస్తాల రాంకిష్టు కాలనీలో గ్రామపంచాయతీ అధికారులు సుమారు మూడున్నర వేల ఇండ్లకు పన్నులు వసూలు చేయగా, పట్టాలు ఉన్న ఇండ్లు కనీసం వందల సంఖ్యలో కూడా లేవు. గతంలో ప్రభుత్వం జీఓ నెంబర్ 58 కింద కొన్ని ఇండ్లకు పట్టాలు జారీ చేసింది. ఇంకా గ్రామపంచాయతీ పన్ను వసూలు చేయని ఇండ్లు కూడా వందల సంఖ్యలోనే ఉంటాయి. ఇలా పన్ను కట్టకుండా, ఇంట్లో ఎవరూ లేకుండా ఉండే ఇండ్లు, జాగాలను కబ్జా చేసేస్తున్నారు. బాండ్ల మీదనే క్రయ విక్రయాలు జరగడం, సివిల్ కేసు అంటూ పోలీసులు పట్టించుకోకపోవడం, కోర్టుకు వెళ్లే అవకాశాలు కూడా లేకపోవడం వంటి కారణాలతో కబ్జాదారులు మరింత రెచ్చిపోతున్నారు.
- అడిగితే బెదిరింపులు
- లబోదిబోమంటున్న యజమానులు
మావల మండలంలోని కస్తాల రాంకిష్టు కాలనీ.. దశాబ్ద కాలం క్రితం పేదల కోసం ఏర్పాటైంది. ప్రభుత్వాలు పేదలకు భూములు కేటాయించకపోవడంతో ఎర్ర జెండా పార్టీలు పేదలతో కలిసి అక్కడ గుడిసెలు నిర్మించాయి. కనీస వసతులు లేకపోయినా అక్కడ పేదలు సంవత్సరాల తరబడి నివసించారు. కాలం గడిచిన కొద్దీ కాలనీ అభివృద్ధి చెందింది. అక్కడ ప్లాట్ల క్రయవిక్రయాలు కూడా ప్రారంభమయ్యాయి. దీంతో వివిధ అవసరాల నిమిత్తం పేదలు తాము నివసించిన గుడిసెలను అమ్ముకోవడానికి సిద్ధం కాగా, మధ్యతరగతి ప్రజలు సొంతింటి కలను నిజం చేసుకోవడానికి, భవిష్యత్ అవసరాల కోసం వాటిని కొనుగోలు చేసి ఉంచుకున్నారు.
ఈ కొనుగోలు, అమ్మకాలు కేవలం బాండ్ పేపర్ల మీదనే కొనసాగాయి. దీన్ని అవకాశంగా మలుచుకొని కొందరు నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులమనే చెప్పుకునే వారు కాలనీలో కబ్జాల పర్వం మొదలుపెట్టారు. ఖాళీ జాగా, లేదా బేస్మెంట్ వరకు కట్టి కనిపించినా సరే కబ్జా చేసేశారు. వాటిని ఇతరులకు అమ్ముకున్నారు. యజమానులు వచ్చి అడిగితే మధ్యవర్తిత్వం నడిపించారు. డబ్బులు డిమాండ్ చేయడం, అడిగినంత ఇవ్వకపోతే నీ ప్లాట్ మర్చిపొమ్మని చెప్పడం, వినకపోతే బెదిరింపులకు దిగడం మొదలుపెట్టారు. ఇలా వందలాది ప్లాట్లు కబ్జా చేసి అమ్ముకుంటూ లక్షలాది రూపాయలు సంపాదించేసుకున్నారు.
ఒక్కొక్కరికి పదేసి ఇండ్లు
పార్టీలు, సంఘాల నాయకులుగా చెప్పుకునే కొందరు కేఆర్కే కాలనీలో ప్లాట్లు కబ్జా చేసుకొని పదేసి ఇండ్లు నిర్మించుకొని వాటిని కిరాయికి ఇస్తున్నారు. స్థానిక నాయకుడిగా చెప్పుకునే ఓ వ్యక్తి ఈ కబ్జాల పర్వంలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. జాగాను కబ్జా చేసి రాత్రికి రాత్రే అక్కడ నిర్మాణాలు మొదలు పెడుతున్నాడు. యజమానులు వస్తే వారిని తీవ్ర బెదిరింపులకు గురి చేస్తున్నాడు. మానవ హక్కుల అసోసియేషన్ నాయకుడిగా చెప్పుకునే మరో వ్యక్తి కేఆర్కే కాలనీలో కనీసం పది ఇండ్లు కట్టాడు. అతను మాత్రం జిల్లా కేంద్రంలో నివాసముంటూ ఆ ఇండ్లను కిరాయికి ఇస్తున్నాడు. ఈ కబ్జాల పర్వం నిరంతరంగా కొనసాగుతుండడంతో అక్కడ ప్లాట్లు కొనుగోలు చేసిన వ్యక్తులు తీవ్ర నష్టాలకు గురై ఆర్థికంగా కుంగిపోతున్నారు.
ఊరడింపులు.. బెదిరింపులు..
తమ ప్లాటు కబ్జా అయిందని ఎవరైనా స్థానిక నాయకులకు వద్దకు వెళ్లి గోడు వెళ్లబోసుకుంటే.. ముందుగా వారిని ఊరడిస్తున్నారు. కబ్జా చేసిన వారికే ఆ ప్లాటు వదిలివేయాలని, వేరే ప్లాటు చూయిస్తామని చెబుతున్నారు. నెలలు గడిచినా వేరే ప్లాటు చూయించక మళ్లీ కలిస్తే.. చూయిస్తామంటూ చెబుతున్నారు. ఒత్తిడి తెస్తే ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోవాలని, పోలీస్ స్టేషన్కు వెళ్లినా సివిల్ కేస్ అంటారని చెబుతున్నారు. ప్లాట్ల దగ్గరికి వెళ్తే.. ఇటు వైపు మళ్లీ వస్తే కాళ్లు చేతులు విరగ్గొడ్తామని అక్కడి వారు భయపెడుతున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక ప్లాట్ల యజమానులు తలలు పట్టుకుంటున్నారు. ప్రాణభయంతో ప్లాట్లను విడిచిపెట్టేసి ఆర్థికంగా నష్టపోతున్నారు.
కొన్నింటికే పట్టాలు
కస్తాల రాంకిష్టు కాలనీలో గ్రామపంచాయతీ అధికారులు సుమారు మూడున్నర వేల ఇండ్లకు పన్నులు వసూలు చేయగా, పట్టాలు ఉన్న ఇండ్లు కనీసం వందల సంఖ్యలో కూడా లేవు. గతంలో ప్రభుత్వం జీఓ నెంబర్ 58 కింద కొన్ని ఇండ్లకు పట్టాలు జారీ చేసింది. ఇంకా గ్రామపంచాయతీ పన్ను వసూలు చేయని ఇండ్లు కూడా వందల సంఖ్యలోనే ఉంటాయి. ఇలా పన్ను కట్టకుండా, ఇంట్లో ఎవరూ లేకుండా ఉండే ఇండ్లు, జాగాలను కబ్జా చేసేస్తున్నారు. బాండ్ల మీదనే క్రయ విక్రయాలు జరగడం, సివిల్ కేసు అంటూ పోలీసులు పట్టించుకోకపోవడం, కోర్టుకు వెళ్లే అవకాశాలు కూడా లేకపోవడం వంటి కారణాలతో కబ్జాదారులు మరింత రెచ్చిపోతున్నారు.
Comments
Post a Comment